#AA19 గ్లామర్ జాయిన్ అయింది !


త్రివిక్రమ్-బన్నీలది హిట్ కాంబో. వీరి కాంబోలో హ్యాట్రిక్ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తయింది. బన్నీపై కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. ఆ తర్వాత చిత్రబృందం వేసవి సెలవులు తీసుకొంది. ఇప్పుడా సెలవులు ముగిశాయ్. ఈరోజు (జూన్5) నుంచి హైదరాబాద్ లో రెండో షెడ్యూల్ మొదలుకానుంది. హీరోయిన్ పూజా హెగ్డే కూడా షూటింగ్ లో జాయిన్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. నిర్మాణ సంస్థ హారిక & హాసిని ట్విట్ చేసింది.

రెండో షెడ్యూల్ సుదీర్ఘంగా సాగనుందని తెలిసింది. దాదాపు 30రోజుల పాటు కొనసాగనున్న ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో తల్లి సెంటిమెంట్ బలంగా ఉండనుందని సమాచారమ్. బన్నీ తల్లీ పాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ టబు కనిపిస్తారట. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. గీతా ఆర్ట్స్, హారిక & హాసిని సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దసరా కానుకగా #AA19ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.