‘భారత్’ సెలబ్రేషన్స్ చూశారా.. ?

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తాజా చిత్రం ‘భారత్’. కత్రినా కైఫ్ కథానాయిక. అలీ అబ్బాస్‌ దర్శకత్వం వహించారు. ఇందులో సల్మాన్ 18 ఏళ్ల యువకుడి నుండి 70 ఏళ్ల వృద్ధుడి వరకు డిఫరెంట్ గెటప్ లలో పోషించారు. టబు, దిషా పటానీ, సునీల్ గ్రోవర్, జాకీ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించారు. రంజాన్ కానుకగా ‘భారత్’ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది.

సినిమా హిట్ టాక్ సొంతం చేసుకొంది. కంప్లీట్ ఎంటర్ టైనర్. కామెడీ, ఎమోషన్స్ ని దర్శకుడు బాగా డీల్ చేశాడు. సల్మాన్ కెరీర్ లోనే ది బెస్ట్ ఫర్ ఫామెన్స్ ఇచ్చాడని చెప్పుకొంటున్నారు. పాజిటివ్ టాక్ తో సల్మాన్ అభిమానులు సెలబ్రేషన్స్ మొదలెట్టారు. అసలు సినిమాలు మొదలవ్వక ముందే అభిమానులు థియేటర్స్ దగ్గర హంగామా చేశారు. భారత్.. భారత్ అంటూ థియేటర్స్ మారుమ్రోగిపోతున్నాయి.