‘హిరణ్యకశ్యప’ దేశంలోనే పెద్ద సినిమా !


‘హిరణ్యకశ్యప’ సినిమా భారతదేశంలోనే అతి పెద్ద సినిమా అవుతుందని అంటున్నారు నిర్మాత సురేష్ బాబు. గురువారం రామానాయుడు జయంతి. ఆయన స్థాపించిన సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఇటీవల 55 ఏళ్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సురేష్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. సురేష్ ప్రొడక్షన్స్ లో రాబోతున్న సినిమాల వివరాలు తెలిపారు.

“మా సంస్థ నుంచి త్వరలో చాలా సినిమాలు రాబోతున్నాయ్‌. మా అబ్బాయి రానాతో ‘హిరణ్యకశ్యప’, ‘విరాటపర్వం’ సినిమాలు నిర్మిస్తున్నాం. ‘హిరణ్యకశ్యప’ కోసం దాదాపు రెండున్నరేళ్లుగా పూర్వ నిర్మాణ పనులు చేస్తున్నాం. ఆ సినిమా ప్రీ విజువలైజేషన్‌ కోసం ఇప్పుడు కూడా వంద మంది పనిచేస్తున్నారు. అదంతా పూర్తయ్యాకే సినిమాని సెట్స్‌పైకి తీసుకెళతాం. ఈ సినిమా భారతదేశంలోనే అతి పెద్ద చిత్రమయ్యే అవకాశాలున్నాయి. అమర చిత్ర కథల్ని కూడా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళుతున్నాం” అన్నారు సురేష్ బాబు.