అనసూయ ‘కథనం’ భయపెడుతోంది !


హాట్ యాంకర్ అనసూయ నటిగానూ రాణిస్తున్నారు. సోగ్గాడే చిన్నినాయన, క్షణం, రంగస్థలం, గూడచారి చిత్రాలతో నటిగా గుర్తింపు తెచ్చుకొంది. అనసూయ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘కథనం’. రాజేష్ నాదెండ్ల దర్శకుడు. ఇదో క్రైమ్ థిల్లర్. ఇందులో అనసూయ అసిస్టెంట్ డైరెక్టర్ గా కనిపించనుంది. రంజాన్ పండగ కానుకగా ‘కథనం’ కొత్త పోస్టర్ ని విడుదల చేసింది చిత్రబృందం.

చుట్టూ శవాల మధ్య చైర్ లో కూర్చోని అనసూయ స్క్రిప్ట్ రాస్తున్నట్టుగా పోస్టర్ లో చూపించారు. ఒక్కమాటలో చెప్పాలంటే అనసూయ కథనం భయపెట్టేలా ఉంది. ఈ చిత్రంలో ధనరాజ్, వెన్నెల కిషోర్, అవసరాల శ్రీనివాస్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జులై కథనం ప్రేక్షకుల ముందుకు రానుంది.