విజయశాంతి సన్నబడుతోంది !

లేడీ సూపర్ స్టార్ విజయశాంతి రీ-ఎంట్రీకి రెడైన సంగతి తెలిసిందే. దాదాపు 13యేళ్ల గ్యాప్ తర్వాత తిరిగి సినిమాల్లోకి వస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో కీలక పాత్రలో నటించనుంది. ఈ నెల 26న రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో విజయశాంతి ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.

రెగ్యూలర్ గా జిమ్ కి వెళ్తుందట. బాగా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుందట. ఆమె ఎన్ని కేజీల బరువు తగ్గాలనే టార్గెట్ పెట్టుకొన్నారన్నది తెలియాల్సి ఉంది. విజయశాంతి మంచి డ్యాన్సర్. మెగాస్టార్ చిరంజీవి-విజయశాంతి కలిసి స్టెప్పులేస్తే ఆ మజాయే వేరుగా ఉండేది. ‘సరిలేరి నీకెవ్వరు’లోనూ ఆమెతో డ్యాన్స్ చేయించాలని దర్శకుడు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

ఇక, ఈ సినిమాలో మహేష్ కి జంటగా రష్మిక మందన నటించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తారు. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే యేడాది సంక్రాంత్రి కానుకగా సరిలేరు నీకెవ్వరు ప్రేక్షకుల ముందుకు రానుంది.