భారత్ సెంచరీ


భారత్ సెంచరీకి చేరువలో ఉంది. అలీ అబ్బాస్‌ దర్శకత్వంలో సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌, టబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘భారత్’. రంజాన్ కానుకగా బుధవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన భారత్ బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. ఈ సినిమా రెండ్రోజుల్లోనే రూ. 73కోట్లు కలెక్ట్ చేసింది. ఇక మూడో రోజు (శుక్రవారం) రూ. 22.20కోట్లు వసూలు చేసింది. మొత్తం మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా భారత్ కలెక్షన్స్ రూ. 95.50కోట్లు చేరాయి.

భారత దేశం, భారత్‌ (సల్మాన్‌) కలిసి చేసిన ప్రయాణమే ఈ సినిమా కథ. స్వాతంత్య్రం, దేశ విభజన, నిరుద్యోగం, ఎమర్జెన్సీ, ఆర్థిక మాంద్యం.. ఇలా ప్రతి దశనూ దాటుకుంటూ, ప్రతి సవాల్‌నూ ఎదుర్కొంటూ, ప్రతి గాయాన్నీ తట్టుకుంటూ భారత్‌ ఎలా ఎదిగారన్నది ఈ సినిమాలో చక్కగా చూపించారు. కథని వినోదాత్మకంగా చెబుతూనే ఎమోషన్స్ ని టచ్ చేశాడు దర్శకుడు అలీ అబ్బాస్. ఇక, ఈ యేడాది ‘భారత్’ బ్లాక్ బస్టర్ హిట్ అందుకొన్న సల్మాన్ వచ్చే యేడాది రంజాన్ కు ‘ఇన్షా అల్లా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.