‘ఆల్ ఈజ్ వెల్’ అంటోన్న మెహ్రీన్

ఎఫ్ 2 తో హనీ ఈజ్ ద బెస్ట్ అనిపించుకొంది మెహ్రీన్. ఇప్పుడు ఆల్ ఈజ్ వెల్ అంటోంది. శతమానం భవతి, శ్రీనివాస కళ్యాణం తర్వాత ఫ్యామిలీ సినిమాల దర్శకుడు సతీష్ వేగ్నేశ కల్యాణ్ రామ్ హీరో ఓ సినిమా ప్లాన్ చేశారు. ఈ చిత్రానికి ‘ఆల్ ఈజ్ వెల్’ అనే టైటిల్ అనుకొంటున్నారు. ఈ సినిమా కోసం హీరోయిన్ గా మెహ్రీన్ ని తీసుకొన్నట్టు తెలుస్తోంది. సతీష్ వేగ్నేశ తనదైన శైలిలో.. ఫ్యామిలీ సబ్జెక్ట్ లోనే కొద్దిగా యాక్షన్ టచ్ తో స్క్రిప్ట్ తయారుచేసినట్లు తెలిసింది.

క‌ల్యాణ్ రామ్ ఈమ‌ధ్య రూటు మార్చాడు. ‘118’తో ఓ థ్రిల్ల‌ర్ స‌బ్జెక్ట్‌ని ఎంచుకున్నాడు. అది మంచి ఫ‌లితం ఇచ్చింది. ‘తుగ్ల‌క్‌’తో మ‌ళ్లీ క‌మ‌ర్షియ‌ల్ బాట ప‌ట్టాడు. మ‌ల్లిడి వేణు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో మాస్ మ‌సాలా అంశాలు ఎక్కువ ఉండ‌బోతున్నాయి. అందుకే క‌ల్యాణ్ రామ్ మ‌ళ్లీ రూటు మార్చి.. సతీష్ విగ్నేశ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో నటించనున్నారు. ఆదిత్య మ్యూజిక్ బ్యానర్ పై ఉమేష్ గుప్తా నిర్మాతగా ఈ సినిమా రాబోతోంది. త్వరలోనే సినిమా ప్రారంభం కానుంది.