ఘనంగా ‘భీష్మ’ పూజా


నితిన్ హీరోగా వెంకీ కుడుమల దర్శకత్వంలో ‘భీష్మ’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. రష్మీక మందన కథానాయిక. మరో కథానాయికగా కీర్తి సురేష్ కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై చిత్రబృందం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

తాజాగా, ఈ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ నెల 20 నుంచి సినిమా రెగ్యూలర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ చిత్రానికి దాదాపుగా ‘ఛలో’ టీమ్ పనిచేస్తుంది. మహతి సాగర్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో నితిన్ రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రెడీ అవుతున్నాయి. రెండో చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు.