పవన్-పూనమ్ కేసు.. దొంగ దొరికాడు !

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో హీరోయిన్ పూనమ్ కౌర్‌ కు లింకు పెట్టి బోలేడు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. వీరి మధ్య ఏదో ఉంది. ఎఫైర్ నడించిందనే రేంజ్ లో కటింగ్ ఇచ్చారు. దీనికి సినీ, రాజకీయ విశ్లేషకుడు కత్తి మహేష్ చేసిన కామెంట్స్ అగ్నికి ఆజ్యం పోశాయి. దీన్ని ఆధారంగా చేసుకొని ఎన్నికల వేళ పవన్ కల్యాణ్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసే ప్రయత్నాలు జరిగాయి. ఇందులో భాగంగా పూనమ్ మాట్లాడినట్టు ఓ ఆడియో టేపు సంచలనం సృష్టించింది. దీనిపై పూనమ్ అప్పట్లో సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేసింది.

అదే సమయంలో వైకాపా మహిళా నేత లక్ష్మీ పార్వతీ తనపై సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ సైబర్ క్రైం పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఈ రెండు కేసుల్లో నిందితుడు ఒకరేనని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. అతడే లక్ష్మీ పార్వతీ ఇంట్లో పని చేసే జూనియర్ ఆర్టిస్టు కోటి అని తేల్చారు. ఇతడు తనని లక్ష్మీ పార్వతీ లైంగిక వేధిస్తుంది అంటూ పోలీసులకి ఫిర్యాదు చేయడం కొసమెరపు. ఇంతకాలం పోలీసుల కళ్లు కప్పి తప్పించుకొని తిరిగిన కోటీ తాజాగా పోలీసులకి లొంగిపోయాడు.

అసలు దొంగ దొరకడంతో పూనమ్, లక్ష్మీ పార్వతీలకి ఊపిరిపీల్చుకొన్నారు. వీళ్ల ఇమేజ్ ని డ్యామేజ్ చేయాల్సిన అవసరం కోటీకి ఏముంది ? అతడి వెనకాల ఎవరైనా సినీ, రాజకీయ ప్రముఖులు ఉన్నారా ?? అన్నది పోలీసుల విచారణలో తేలనుంది.