మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ధర్మాన కృష్ణదాస్‌

ధర్మాన కృష్ణదాస్‌ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సచివాలయం ఐదో బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో అడుగుపెట్టిన కృష్ణదాస్‌ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఎన్డీబీ ప్రాజెక్టుకు సంబంధించిన ఫైలుపై మంత్రి కృష్ణదాస్‌ తొలి సంతకం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. దుర్గగుడి ఫ్లైఓవర్‌ నిర్మాణం డిసెంబర్‌ కల్లా పూర్తి చేస్తామన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ పాలన చేస్తున్నాం. అనంత-అమరావతి ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. మరో రెండేళ్లలో అనంత-అమరావతి ఎక్స్‌ప్రెస్‌ వే పూర్తవుతుందన్నారు.