గ్రేట్ : 2100 మంది రైతుల అప్పులు తీర్చిన అమితాబ్

బిగ్ బీ అమితాబ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. బీహార్ కు చెందిన రైతుల అప్పులను తీరుస్తానని మాట ఇచ్చిన అమితాబ్.. ఆ మాటని నిలబెట్టుకొన్నారు. బిహార్ కు చెందిన ఎంపిక చేసిన 2100మంది రైతులరుణాలను తీర్చేశారు. ఈ విషయాన్ని ఆయన తన బ్లాగ్‌లో పేర్కొన్నారు.

“నేను ముందుగా ప్రామిస్‌ చేసినట్లుగానే బిహార్‌కు చెందిన 2100 రైతులను ఎంపికచేసి వారి అప్పులను తీర్చేశాను. కొందరి అప్పులను నేరుగా బ్యాంకుల్లోనే వేసేశాను. మరికొందరిని నా నివాసానికి పిలిపించి అభిషేక్‌, శ్వేత చేత చెక్కులు అందించాను” రాసుకొచ్చారు. దానికి సంబంధించిన కొన్ని ఫోటోలని షేర్ చేశారు. ఇప్పుడా పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.