బీజేపీలోకి రేవంత్ రెడ్డి, కోమట్ రెడ్డి.. సీక్రెట్ మంతనాలు.. ?

తెలంగాణ కాంగ్రెస్ ఖాళీ అయ్యే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన 12మంది ఎమ్మెల్యేలు తెరాసలో చేరారు. సీఎల్పీని తెరాస విలీనం చేశారు. మిగిలిన ఎమ్మెల్యేలు కూడా తమ దారి తాము చూసుకొనే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి, కోమట్ రెడ్డి సోదరులు బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్టు సమాచారమ్.

వీరిద్దరు బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ రహస్య మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అవి దాదాపు ఫలించాయి. త్వరలోనే రేవంత్ రెడ్డి, కోమట్ రెడ్ది సోదరులు బీజేపీలో చేరడంపై ప్రకటన రావొచ్చని చెబుతున్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్ది సలైంట్ అయిపోయారు. సీఎల్పీ విలీనంపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో రేవంత్ రెడ్ది పాల్గొనలేదు. కోమట్ రెడ్డి సోదరులు గతంలోనే తెరాసలో చేరే ఆలోచన చేశారు. కానీ, టీ- పీసీసీ పదవి వారిని ఊరించింది. ఇప్పుడు కాంగ్రెస్ కోమట్ రెడ్డి సోదరులు పార్టీ మారాలనే క్లారిటీ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నట్టు టాక్.