శృతిహాసన్ మళ్లీ బలుపు చూపిస్తోంది !

హీరోయిన్ గా బిజీగా ఉన్న సమయంలో టెక్కు చూపించింది శృతిహాసన్. ప్రేమ పేరుతో కెరీర్ ని నిర్లక్ష్యం చేసింది. లండన్‌కు చెందిన థియేటర్ ఆర్టిస్ట్‌ మైఖెల్‌ కోర్సేల్‌ తో ప్రేమలో పడింది. ప్రియుడుని ఫ్యామిలీకి కూడా పరిచయం చేసింది. శృతి కుటుంబ వేడుకలో మైఖైల్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే వీరు పెళ్లి చేసుకోనున్నారనే ప్రచారం జరిగింది. కానీ, వీరు బ్రేకప్ చెప్పుకొన్నారు.

ఈ నేపథ్యంలో శృతిహాసన్ మరోసారి సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఈ మధ్య హాట్ హాట్ ఫోటో షూట్స్ చేసింది. ఆ ఫలితం కూడా దక్కుతోంది. చాన్నాళ్ల తర్వాత శృతికి తెలుగు సినిమా ఆఫర్ వచ్చింది. రవితేజ – గోపీచంద్ మలినేని సినిమా హీరోయిన్ గా శృతిహాసన్ కన్ ఫర్మ్ అయింది. ఇన్నాళ్లు వార్తల్లో నానిన ఈ విషయం, అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేయడంతో ఫైనల్ అయిపోయింది. బలుపు సినిమా తరువాత మళ్లీ రవితేజ-శృతిహాసన్-గోపీచంద్ మలినేని కాంబినేషన్ రిపీట్ కానుంది.