హైదరాబాద్’లో యాదాద్రి భవన్ ప్రారంభం

హైదరాబాద్ బర్కత్‌పురాలో యాదాద్రి భవన్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. యాదాద్రి భవన్‌ను రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కె.వి రమణాచారి, ఆలయ ఈవో గీతా తదితరులు పాల్గొన్నారు.

యాదాద్రి ఆలయ సమాచారం కోసం ప్రభుత్వం యాదాద్రి భవనం నిర్మించింది. ఇందుకోసం రూ. 8కోట్ల ఖర్చు చేశారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సంబంధించిన అర్జిత సేవలు, కల్యాణం, గదులు బుకింగ్‌ చేసుకునే సదుపాయాన్ని యాదాద్రి సేవాభవన్‌లో కల్పించారు.