బ్రేకింగ్ : బీజేపీలో చేరబోతున్న కోమట్ రెడ్డి రాజగోపాల్ రెడ్ది

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమట్ రెడ్ది రాజగోపాల్ బీజేపీలో చేరేందుకు నిర్ణయం తీసుకొన్నారు. కొన్నాళ్లుగా రాజగోపాల్ రెడ్డి అన్నయ్య, భువనగిరి ఎమ్మెల్యే కోమట్ రెడ్ది వెంకట్ రెడ్డి బీజేపీలో చేరబోటున్నట్టు ప్రచారం జరిగింది. ఆయన బీజేపీ నేతలతో చర్చలు కూడా జరిపారని వార్తలొచ్చాయ్. ఐతే, ఆ వార్తలని వెంకట్ రెడ్డి ఖండించారు. కట్టేకాలేవరకు కాంగ్రెస్ లోనే కొనసాగుతానని చెప్పారు. ఐతే, తాజాగా కోమట్ రెడ్ది రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ కు భవిష్యత్ లేదు. తెరాసకు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనన్నారు. రాష్ట్ర నాయకుల కారణంగా తెలంగాణ కాంగ్రెస్ విఫలమైందన్నారు. ఈ నేపథ్యంలో కోమట్ రెడ్డి రాజగోపాల్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నట్టేనని తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి ఒక్కరే బీజేపీలో చేరతారా ? ఆయన అన్నయ్య, భువనగిరి ఎంపీ కోమట్ రెడ్ది వెంకట్ రెడ్డి కూడా బీజేపీలో చేరతారా ?? అన్నది తెలియాల్సి ఉంది. కోమట్ రెడ్డి బ్రదర్స్ ని బీజేపీలో చేర్చుకొనేందుకు ఆ పార్టీ అగ్రనేతలు కూడా ఆసక్తిగా ఉన్నారు.