కీర్తి సురేష్ సినిమాలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ ?


కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగేంద్ర అనే దర్శకుడు రూపొందిస్తున్న చిత్రంలో ఓ కీలకమైన అతిధి పాత్రకు గానూ ఎన్టీఆర్ ని సంప్రదించినట్లు సమాచారమ్. సినిమాలో దాదాపు పది నిముషాలు పాటు సాగే ఈ కామియో కు సంభందించిన నేరేషన్ ఇప్పటికే ఎన్టీఆర్ విన్నారట. అయితే ఫైనల్ గా ఓ సారి మొత్తం విని తను మాత్రమే చేయగలిగే పాత్ర అయితే చేస్తానని మాట ఇచ్చారట. ఈ గెస్ట్ రోల్ లో చేయమని ఎన్టీఆర్ సన్నిహితుడు, పి ఆర్ మహేష్ కోనేరు స్వయంగా ఎన్టీఆర్ ని అడిగారట.

ప్రస్తుతం తారక్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ప్రస్తుత షెడ్యూల్ లో తారక్ ఒక్కరే పాల్గొంటున్నారు. ఆయనపై యాక్షన్ సీన్ ని షూట్ చేస్తున్నారు. తర్వాతి షెడ్యూల్ లో ఇంటర్ వెల్ ఏపీసోడ్ ని చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో తారక్ తో పాటు రామ్ చరణ్ మిగితా తారగణం పాల్గొంటారు. ఈ చిత్రాన్ని డివివి దానయ్య దాదాపు రూ. 400కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వచ్చే యేడాది జులై 30న ఆర్ ఆర్ ఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.