‘విరాటపర్వం’ కథ ఇదే.. !

‘నీది నాది ఒకే కథ’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు వేణు ఉడుగుల. అత్యంత సహజంగా సినిమా తీసి ఆకట్టుకొన్నాడు. ఈ దర్శకుడు చేస్తున్న రెండో సినిమా ‘విరాటపర్వం’. రానా-సాయి పల్లవి జంటగా నటించనున్నారు. ఈ చిత్రాన్ని చెరుకూరి సుధాకర్ తో కలిసి సురేష్ బాబు నిర్మిస్తున్నారు. ఇటీవలే ప్రారంభోత్సవం జరుపుకొన్న విరాటపర్వం.. వచ్చేవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటంటే.. ? “సినిమా 1980ల నాటి తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. రానా ఓ నక్సలైట్ గా.. ఓ దళానికి నాయకత్వం వహిస్తూ, సాయుధ పోరాటం చేస్తుంటాడు. ఇతడి జీవితాన్ని రీసెర్చ్ చేసే జర్నలిస్ట్ పాత్రలో సాయిపల్లవి కనిపించనుంది. ఆమె రీసెర్చ్ ప్రారంభించడం, రానాతో ప్రేమలో పడడం లాంటి వ్యవహారాలన్నీ చాలా సహజంగా ఉండబోతున్నాయి. హీరోయిన్ ప్రేమను అంగీకరించిన రానా నక్సలిజాన్ని వదిలేసి, జనజీవన స్రవంతిలో కలుస్తాడా? లేక సాయిపల్లవినే తన భావజాలం వైపు లాక్కొస్తాడా ? ” అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రాబోతున్నట్టు తెలుస్తోంది.