విజయ్ దేవరకొండ ధైర్యం చెప్పాడు

‘భరత్ అను నేను’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది కైరా అద్వానీ. ఆ తర్వాత ‘వినయ విధేయ రామ’లో సందడి చేసింది. ఈ సినిమా ప్లాప్ కావడంతో కైరాకు తెలుగులో మరో అవకాశం రాలేదు. సందీప్‌ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘అర్జున్‌రెడ్డి’ హిందీ రీమేక్‌ ‘కబీర్‌ సింగ్‌’లో నటించింది కియారా. ఈ నెల 21న ‘కబీర్ సింగ్’ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ వచ్చిన కైరా మీడియాతో ముచ్చటించింది.

‘విజయ్‌ దేవర కొండని ఒక అవార్డు వేడుకలో కలిశా. ‘అర్జున్‌రెడ్డి’ గురించి మాట్లాడుకున్నాం. కానీ… తనేం సలహాలు ఇవ్వలేదు. సందీప్‌రెడ్డి ఉన్నాడు కదా, ధైర్యంగా ఉండమని చెప్పాడంతే. మూల కథ అదే. ఇక ఆశ్చర్యపోయే కొత్త విషయాలు ఏమున్నాయనేది తెరపైనే చూడాలి. ఇదో మోడ్రన్‌ లవ్‌స్టోరీ. నేటి ప్రేమల్లో ముద్దులు, కౌగిలింతలు సహజం. ఇందులో అవి సహజంగా అందంగా ఉంటాయి. ఎక్కడా ఇబ్బంది అనిపించలేదు” అని చెప్పుకొచ్చింది కైరా.