‘సాహో’ విషయంలో మాట మార్చాడు


టాలీవుడ్ నుంచి రాబోతున్న మరో భారీ సినిమా ‘సాహో’. సుజీత్ దర్శకుడు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రమిది. ఈ యాక్షన్ థ్రిల్లర్ ని దాదాపు రూ. 300కోట్ల భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఆగస్టు 15న సాహో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐతే, సినిమాపై పాజిటివ్ ప్రచారంతో పాటు, నెగటివ్ ప్రచారం కూడా జరుగుతోంది.

సాహో టీజర్ రాకముందే.. ఇదో వీడియో గేమ్ లాంటి సినిమా అంటూ.. సినీ విశ్లేషకుడు కెఆర్క్ ట్విట్ చేశాడు. ఐతే, సాహో టీజర్, దానికి దక్కిన దక్కుతున్న రెస్పాన్స్ కి కెఆర్క్ మతిపోయింది. సాహో టీజర్ దెబ్బకి రికార్డులన్నీ బద్దలయ్యాయి. విడుదలైన 24గంటల్లోనే 60మిలియన్ వ్యూస్ పైగా సొంతం చేసుకొని కొత్త చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో సాహో పై కెఆర్కే తన అభిప్రాయాన్ని మార్చుకొన్నాడు. ప్రభాస్ బాలీవుడ్ సూపర్ స్టార్, ‘సాహో’ సూపర్ హిట్ అవుతుందని తాజాగా ట్విట్ చేశాడు.