‘ఓటర్’ని తొక్కేశారు.. !

ఈవారం బాక్సాఫీస్ దగ్గర మూడు సినిమాలు సందడి చేస్తున్నాయి. మల్లేశం, ఓటర్, ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వీటిలో మల్లేశం, ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ సినిమాలపై హిట్ టాక్ వినిపిస్తోంది. ఈ రెండు సినిమాలు బాగున్నాయని ట్విట్టర్ రివ్యూలు, పబ్లిక్ టాక్ లు చెబుతున్నాయి. ఐతే, మంచు విష్ణు ‘ఓటర్’ని మాత్రం ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఓటర్ టాక్ ఏంటీ ? అన్నది తెలియడం లేదు. చూస్తుంటే.. మిగితా రెండు సినిమాలు ఓటర్ ని తొక్కేసినట్టే కనిపిస్తోంది.

జీఎస్ కార్తీక్ దర్శకత్వం దర్శకత్వంలో ‘ఓటర్’ తెరకెక్కింది. మంచు విష్ణుకి జంటగా సురభి జతకట్టింది. రామా రీల్స్ బ్యానర్‌పై జాన్ సుధీర్ నిర్మించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందే ఓటర్ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోయిన సినిమాల లిస్టులో ఓటర్ ఒకటి. ఆ తర్వాత దర్శకుడు జీఎస్ కార్తీక్, హీరో మంచు విష్ణు మధ్య వివాదం చెలరేగింది. అన్నీ సమస్యలు పరిష్కరించుకొని ఓటర్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొస్తే.. రెస్పాన్స్ లేదు. ఇది ఓటర్ కు గట్టిదెబ్బనే చెప్పాలి.