‘దర్బార్’లో యువీ తండ్రి


మురగదాస్ దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న చిత్రం ‘దర్బార్’. నయనతార కథానాయిక. బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. అంతేకాదు.. ఈ చిత్రంలో ప్రముఖ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ తండ్రి యోగ్‌రాజ్‌ కీలక పాత్రలో నటిస్తున్నారట. ఈ మేరకు కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

దర్భార్ లో యోగ్‌రాజ్‌ ఓపెనింగ్‌ ఫైట్‌ సీన్‌లో నటిస్తున్నారని‌, రజనీతో తలపడే సన్నివేశాల్లో కనిపించనున్నారని సమాచారమ్. ఒకప్పటి క్రికెటర్‌ అయిన యోగ్‌రాజ్‌ సింగ్‌.. సినీ నటుడిగానూ గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు వందకు పైగా హిందీ చిత్రాల్లో నటించారు. 2020 సంక్రాంతికి దర్భార్ ప్రేక్షకుల ముందుకు రానుంది.