సుధీర్ బాబు ప్లాప్ సినిమా.. హిందీలో హిట్ !

సుధీర్ బాబు – నందిత జంటగా నటించిన చిత్రం “కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని”. ఈ చిత్రానికి ఆర్. చంద్రు దర్శకత్వం వహించారు. 2015లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం కమర్షియల్ గా ఆడలేదు. కానీ, జైపూర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కి ఎంపికైంది. బెస్ట్ రొమాంటిక్ మూవీ అవార్డు గెలుచుకుంది. ఇప్పుడీ సినిమా “వోల్టేజ్ 420” పేరుతో హిందీలో డబ్ అయింది.

ఓ టీవీ ఛానల్లో ప్రసారమై విశేష ఆదరణ సొంతం చేసుకుంది. యూట్యూబ్ లో హవా చూపిస్తోంది. 60లక్షల వ్యూస్ సాధించింది. సుధీర్ బాబు బాలీవుడ్ ప్రేక్షకులకి సుపరిచితుడే. ‘భాగీ’ సినిమాలో విలన్ గా నటించారు. సుధీర్ బాబు నటిస్తున్న గోపీచంద్ బయోపిక్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సుధీర్ సినిమాయే కాదు.. తెలుగు ప్లాప్ సినిమాలో హిందీ డబ్ అయి మంచి రెస్పాన్స్ ని తెచ్చుకొన్నాయి. అట్టర్ ప్లాప్ గా నిలిచిన త్రివిక్రమ్-పవన్ ల అజ్ఝాతవాసిని బాలీవుడ్ ప్రేక్షకులు ఎగబడి చూసిన సంగతి తెలిసిందే.