నడిగర్‌ పోరు ముగిసింది.. ఫలితాలే మిగిలాయ్ !


2019-2022 ఏడాదికి గానూ నడిగర్‌ సంఘం ఎన్నికలు ముగిశాయి. సంఘంలో మొత్తం 3,100 మంది సభ్యులు ఉండగా.. 1,587 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. జులై 8న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

నాజర్‌ నేతృత్వంలోని పాండవార్‌ జట్టు, భాగ్యరాజ్‌ స్వామి నేతృత్వంలోని శంకర్‌దాస్‌ జట్టు బరిలో నిలిచాయి. నడిగర్‌ సంఘం అధ్యక్ష పదవికి పాండవార్‌ జట్టు నుంచి నటుడు నాజర్‌, శంకర్‌దాస్‌ జట్టు నుంచి నటుడు భాగ్యరాజ్‌ బరిలో ఉన్నారు. జనరల్‌ సెక్రటరీ పదవికి విశాల్‌, నిర్మాత గణేశ్‌ పోటీపడుతున్నారు. కోశాధికారి పదవికి నటుడు కార్తీక్‌, నటుడు ప్రశాంత్‌ బరిలో ఉన్నారు.

ముంబయిలో ‘దర్బార్‌’ షూటింగ్‌లో ఉన్న తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కు పోస్టల్‌ బ్యాలెట్‌ సరైన సమయంలో అందకపోవడంతో ఆయన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. దీనిపై రజనీకాంత్‌ అసహనం వ్యక్తం చేశారు.