‘బుర్రకథ’ ట్రైలర్ టాక్

ప్రముఖ రచయిత డైమండ్‌ రత్నబాబు దర్శకత్వంలో ఆది సాయి కుమార్‌ నటిస్తున్న చిత్రం ‘బుర్రకథ’. మిస్త్రీ చక్రవర్తి, నైరా షా హీరోయిన్లు. రాజేంద్రప్రసాద్‌, పోసాని కృష్ణమురళి కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ హీరో వెంకటేష్ చేతుల మీదుగా రిలీజ్ అయ్యింది. ‘ఒకే బుర్ర‌లో ఇద్ద‌రు మ‌నుషులుంటే’ కాన్సెప్ట్ తో బుర్రకథ తెరకెక్కినట్టు ట్రైలర్ తో అర్థమవుతోంది.

‘రామాయణంలో రాముడు శత్రువు రావణాసురుడు, కృష్ణుడు శత్రువు కంసుడు, నా శత్రువు నాతోనే’ అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదలవుతుంది. అభి, రామ్ అనే రెండు డిఫరెంట్ క్యారెక్టర్లలో ఆది కనిపించనున్నాడు. కామెడీ, యాక్షన్, ఎమోషన్ బిట్ సీన్స్ తో ట్రైలర్ ని కట్ చేశారు. డైలాగ్స్ బాగా పేలాయ్. ఈ నెల 28న బుర్రకథ ప్రేక్షకుల ముందుకు రానుంది.