కోహ్లీ, బూమ్రాలకి విశ్రాంత్రి

టీమిండియా కీలక ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, బూమ్రాలకి విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. ప్రపంచకప్‌ తర్వాత వెస్టిండీస్‌తో జరగనున్న టీ20 సిరీస్‌, వన్డే సిరీస్‌కు వీరిద్దరికి విశ్రాంతి ఇవ్వనున్నారు. యునైటెడ్‌ స్టేట్స్‌లో అగస్ట్‌ 3 నుంచి వెస్టిండీస్‌తో జరిగే మూడు టీ20లు, వెస్టిండీస్‌లో జరిగే మూడు వన్డేలకు కోహ్లీ, బుమ్రా దూరంకానున్నారు. ఈ మేరకు బీసీసీఐ సీనియర్‌ అధికారి పేర్కొన్నారు.

టీ20, వన్డే సిరీస్‌లకు మాత్రమే కోహ్లీ, బూమ్రాలకి విశ్రాంతి. అగస్ట్‌ 22 నుంచి మొదలయ్యే టెస్ట్‌ సిరీస్‌లో తిరిగి పాల్గొంటారని తెలిపారు. ఇక, ప్రపంచకప్ లో టీమిండియా అదరగొడుతోంది. ఇప్పటికే భారత్‌ నాలుగు విజయాలు, ఒక రద్దైన మ్యాచ్‌తో తొమ్మిది పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.