నితిన్29 టైటిల్ ‘రంగ్ దే !’


నితిన్ హీరోగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వెంకీ కడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ మొదలైంది. ఇదే బ్యానర్ లో రాబోతున్న నితిన్ రెండో సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ ఫిక్సయింది. ‘రంగ్ దే !’ పెట్టారు. #gimmesomelove అనేది ట్యాగ్ లైన్. టైటిల్ పోస్టర్ కూడా వదిలారు. పోస్టర్ పై 2020 వేసవిలో సినిమా విడుదల ఉండనుందని పేర్కొన్నారు.

ఈ చిత్రంలో నితిన్ జంటగా కీర్తి సురేష్ నటించనుంది. మరో హీరోయిన్ గా రష్మిక మందన కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రానికి పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు. ‘ఇష్క్’ తర్వాత నితిన్-పిసి శ్రీరామ్ కాంబో రిపీట్ కానుంది. వరుస ప్లాపుల్లో ఉన్న నితిన్ నిలబెట్టడం ఇప్పుడు సితార చేతుల్లోనే ఉంది.