‘ప్రతిరోజూ పండగే’ మొదలైంది

మారుతి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా సినిమా మొదలైంది. ఈ చిత్రానికి ‘ప్రతిరోజు పండగే’ టైటిల్ పెట్టారు. ఈ ఉదయం ఘనంగా ప్రారంభోత్సం జరుపుకొంది. గీతా ఆర్ట్స్ 2, యువీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. టైటిల్స్ కి తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని వచ్చే యేడాది సంక్రాంత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.


‘చిత్రలహరి’ తర్వాత తేజు చేస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులల్ల్ భారీ అంచనాలున్నాయి. ‘ప్రతిరోజు పండగే’ కథని మెగాస్టార్ చిరంజీవి ఓకే చేశారు. మారుతి మార్క్ కాన్సెప్ట్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రతిరోజు పండగే ఉండబోతుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో తేజుకి జంటగా రాశీఖన్నా జతకట్టనుంది.