జనసేనలోకి వంగవీటి రాథ

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ మారి చేతులు కాల్చుకొన్నాడు వంగవీటి రాథ. వైకాపా నుంచి టికెట్ ఇవ్వడం లేదనే అక్కసుతో టీడీపీలో చేరారు. టీడీపీ కూడా ఆయనకి టికెట్ ఇవ్వలేదు. దీంతో అసంతృతితో ఉన్న వంగవీటి రాజకీయాలకి అంటిముట్టనట్టు ఉంటున్నారు. ఇప్పుడాయన జనసేనలో చేరేందుకు రెడీ అవుతున్నట్టు తెలిసింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ అయి
పార్టీ చేరడంపై చర్చించారు. ఒకట్రెండు రోజుల్లోనే ఆయన జనసేన తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది.

ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలో జనసేనకు షాకింగ్ ఫలితాలొచ్చాయ్. ఆ పార్టీ కేవలం ఒక్క స్థానాన్ని మాత్రమే గెలుచుకొంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాలు భీమవరం, గాజువాకలో ఓడిపోయారు. అయినా.. మడమ తిప్పేది లేదు. ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని పవన్ ప్రకటించారు. ఆ దిశగా ప్రణాఌకలు కూడా రెడీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వంగవీటి లాంటోళ్లు జనసేన వైపు చూస్తున్నట్టు కనిపిస్తోంది.