విజయ్ దేవకొండపై లోకల్ ప్రెజర్

ప్రతి ఏటా జరిగే తానా సభలకు సినిమా, రాజకీయ, సామాజిక ప్రముఖులు పలువురికి ఆహ్వానాలు అందుతుంటాయి. ఈసారి ఆహ్వానాలు అందిన జాబితా పెద్దదే. కానీ, పెద్ద స్టార్స్ ఎవరు తానాకి వెళ్లడం లేదని తెలుస్తోంది. అల్లరి నరేష్, నారారోహిత్, సునీల్ లాంటి హీరోలు మాత్రమే వస్తున్నారు. స్టార్స్ రావడం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే ప్రత్యేక ఆకర్షణ అనుకోవాలి.

టాలీవుడ్ సన్సేషన్ విజయ్ దేవరకొండని తానాకి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారమ్. నేరుగా ఆయన్ని సంప్రదించకుండా లోకల్ గా కొంతమందితో ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారంట. విజయ్ మాత్రం తానాకి నో చెప్పేసినట్టు తెలిసింది. సినిమాలతో ఫుల్లు బిజీ అని చెప్పి తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారంట. ఇక, తానా సభలకి వెళ్లనున్న లిస్టులో కమిలినీ ముఖర్జీ, గాయని సునీత, యాంకర్ సుమ పేర్లు వినిపిస్తున్నాయి. ఇటీవల టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీలు సిఎమ్ రమేష్, టిజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావులకి తానా ఆహ్వానాలు అందాయి.