యూరప్‌ ట్రిప్‌’పై మహేష్ కామెంట్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ యూరప్ ట్రిప్ ని పూర్తి చేసుకొని హైదరాబాద్ చేరుకొన్నారు. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ ఫారిన్ ట్రిప్ పై స్పందించారు. ‘ఇది ఎంతో మధురమైన విహారయాత్ర. ఎందుకంటే రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి ‘మహర్షి’ సినిమా విజయం, మరోటి నా కుమారుడు గౌతమ్‌ నేరుగా చూసిన తొలి ప్రపంచ కప్‌ మ్యాచ్‌ కావడం’ అన్నారు.

బాలీవుడ్ సినిమా చేస్తారా ? అనే ప్రశ్నకి మహేశ్ రొటీన్ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతానికి నా చేతి నిండా సినిమాలు ఉన్నాయి. కాబట్టి దాని గురించి మాట్లాడే అవకాశం లేదన్నారు. ప్రస్తుతం మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నారు. ‘ఎఫ్‌ 2’ తర్వాత అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న సినిమా ఇది. సీనియర్‌ నటి విజయశాంతి ఇందులోని కీలక పాత్ర పోషించబోతున్నారు. రష్మిక కథానాయిక. దిల్ రాజు, అనిల్ సుంకర్, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే యేడాది సంక్రాంత్రి కానుకగా సరిలేరు నీకెవ్వరు ప్రేక్షకుల ముందుకు రానుంది.