చరణ్ షేపులు మారాయ్

దర్శకధీరుడు రాజమౌళిని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిరాశ పరిచినట్టు తెలుస్తోంది. రామ్ చరణ్, తారక్ కు గాయాల కారణంగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కు బ్రేకులుపడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత హీరోయిన్ అలియా భట్ అనారోగ్యం పాలైంది. ఆమె ప్రేగు ఇన్ఫెక్షన్స్ కారణంగా చికిత్స కోసం న్యూయార్క్ వెళ్ళింది. మరోవైపు, గాయం నుంచి కోలుకొన్న రామ్ చరణ్ షేపులు మారాయి.

మునిపటిలా కండల్లేవ్. అవి కరిగాయి. దీంతో ఆయన్ని జక్కన్న యుఎస్ పంపించనున్నట్టు తెలుస్తోంది. మళ్లీ పాత కటౌట్ వచ్చేలా కసరత్తు చేయాలని సూచించారట. అప్పటిలోగా అలియా భట్ కూడా తిరిగిరానుంది. అప్పుడు అలియా, చరణ్ ల మధ్య కొన్ని కీలక సన్నివేశాలతో పాటు చరణ్ పై యాక్షన్ ఏపీసోడ్ ని చిత్రీకరించాలని రాజమౌళి భావిస్తున్నట్టు తెలుస్తోంది.

అల్లూరి సీతారామారాజు, కొమరంభీమ్ ల కథతో ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కుతోంది. వీరిద్దరి మధ్య ఉన్న కామన్ పాయింట్ ని కథగా ఎంచుకొన్నాడు జక్కన్న. అల్లూరిగా రామ్ చరణ్, ఆయనకి జోడీగా అలియా భట్ నటిస్తున్నారు. కొమరంభీమ్ గా తారక్ నటిస్తున్నారు. ఆయన పక్కన హీరోయిన్ ఇంకా సెట్ కాలేదు. దాదాపు రూ. 400కోట్ల బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. 2020 జులై 30న ఆర్ ఆర్ ఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.