రామ్ కు జరిమానా.. ఎందుకంటే ?

ఎనర్జిటిక్ హీరో రామ్ కు ఫైన్ పడింది. ఆయన హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చార్మినార్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. సోమవారం సినిమా షూటింగ్‌ విరామ సమయంలో రామ్ పబ్లిక్ గా సిగరెట్‌ కాల్చినందుకు.. ఆయనకి పోలీసులు రూ.200 జరిమానా విధించారు.

చార్మినార్‌ పరిసరాల్లోని బహిరంగ ప్రదేశాల్లో ధూమపాన నిషేధాన్ని కచ్చితంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చార్మినార్‌ పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగానే ‘కోప్టా’(సిగరేట్‌ అదర్‌ టోబాకో ప్రొడక్ట్‌) చట్టం కింద రామ్ కు జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. రామ్‌తో కలిపి ఇప్పటికి వరకు చార్మినార్‌ పరిసరాల్లో సిగరెట్‌ కాల్చిన 22మందికి ఫైన్ విధించారట.

ఇక ‘ఇస్మార్ట్ శంకర్’కు జోడీగా నిధి అగర్వాల్, నభా నటాషాలు నటిస్తున్నారు. ఛార్మితో కలిసి పూరి నిర్మిస్తున్నారు. జులై 12న ఇస్మార్ట్ శంకర్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇస్మార్ట్ శంకర్ లో పోకిరి రేంజ్ ట్విస్ట్ ఒకటి ఉందట. సినిమా కూడా పోకిరి రేంజ్ హిట్ అందుకుంటుందనే ధీమాతో చిత్రబృందం ఉంది.