మహేష్ ఫంక్షన్’కు నాని చీఫ్ గెస్ట్ ?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 25వ చిత్రం ‘మహర్షి’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంతకుమించి మహేష్ మనసుకు నచ్చిన సినిమా అనిపించుకొంది. మునుపెన్నడూ లేనివిధంగా ‘మహర్షి’ సక్సెస్ ని ఎంజాయ్ చేశారు మహేష్. స్కూల్స్, కాలేజీ, థియేటర్స్ సందర్శించారు. ఇంకా చెప్పాలంటే మహర్షి సినిమా చేసినందుకు గర్వపడుతూ.. ఒకటి కాదు రెండుసార్లు కాలరెగిరేశాడు మహేష్.

ఇప్పుడీ సినిమా 50రోజుల ఫంక్షన్ ని గ్రాండ్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ శుక్రవారం (జూన్28) శిల్పకళా వేదికలో
మహర్షి ఫంక్షన్ జరగనుంది. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా నేచురల్ స్టార్ నానిని ఆహ్వాంచినట్టు సమాచారమ్. ఇది ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. ఇన్నాళ్లు స్టార్ హీరోలు మాత్రమే చీఫ్ గెస్ట్ గా వెళ్లేవారు. నాని కూడా స్టార్ హీరోనే. అంతకుమించి అనిపించుకొన్న కూడా సందర్భాలు ఉన్నాయి. ఐతే, నాని.. మహేష్ కంటే జూనియర్. నాని సినిమాకు మహేష్ చీఫ్ గెస్ట్ అంటే క్రేజీగా ఉండేది. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ట్రెండు మార్చాలనే మహేష్ నానిని చీఫ్ గెస్ట్ గా తీసుకురావాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

ఈ యేడాది ‘జెర్సీ’తో హిట్ కొట్టిన నాని ప్రస్తుతం ‘గ్యాంగ్ లీడర్’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి విక్రమ్ కె కుమార్ దర్శకుడు. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ తో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇక, మహర్షి తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ తెరకెక్కనుంది. త్వరలోనే సినిమా రెగ్యూలర్ షూటింగ్ మొదలు కానుంది.