గ్రేట్ : 300 మంది విద్యార్థులని చదివిస్తున్న నిఖిల్


యంగ్ హీరో నిఖిల్ గొప్ప మనసు చాటుకొన్నారు. 300 మంది చిన్నాలని చదివించేందుకు ముందుకొచ్చారు. “భీమవరానికి చెందిన ఈ 300 మంది చిన్నారులు పాఠశాలకు వెళ్లడం నుంచి చదువు పూర్తయ్యే వరకూ అన్నీ బాధ్యతలు చూసుకుంటా. ఈ గొప్ప పనిలో నాకు భాగస్వామ్యం కల్పించిన మహేందర్‌, రాంబాబుకు ధన్యవాదాలు. భవిష్యత్తులో మరికొందరు చిన్నారుల అభివృద్ధికి తోడ్పతా”నని నిఖిల్‌ ట్వీట్‌ చేశారు. పాఠశాలలో విద్యార్థులతో కలిసి దిగిన ఫొటోలను షేర్‌ చేశారు.

నిఖిల్ సినిమాలు వైవిధ్యంగా ఉంటాయనే ముద్రపడిపోయింది. ఐతే, ఈ మధ్య నిఖిల్ కి సరైన హిట్స్ లేవు. కిర్రాక్‌ పార్టీ, అర్జున్‌ సురవరం’ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ప్రస్తుతం నిఖిల్ ‘కార్తికేయ 2’లో నటించబోతున్నారు. దీనికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించనుంది. త్వరలోనే సినిమా ప్రారంభం కానుంది.