రజనీ సినిమాపై నివేదా షాకింగ్ కామెంట్

నాని ‘జెంటిల్‌మన్‌’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నివేదా థామస్‌. తొలి సినిమాతోనే లేడీ కమల్ హాసన్ అనిపించుకొంది. అందుకు తగ్గట్టుగానే తన తదుపరి సినిమాలని ఎంచుకొంది. ‘నిన్ను కోరి’, ‘జై లవకుశ’, ‘118’ చిత్రాలతో నటించించి. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకొంది. చదువుకుంటూనే సినిమాల్లో నటిస్తోంది. ఆమె నటించిన తాజా చిత్రం ‘బ్రోచేవారెవరురా’. వివేక్‌ ఆత్రేయ దర్శకుడు. ఈ నెల 28న విడుదల కానుంది. మంగళవారం ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నివేదా ఆసక్తికరవిషయాలు చెప్పింది.

“‘బ్రోచేవారెవరురా’ ఓ విభిన్నమైన కథ. సమాజానికి అద్దం పడుతుంది. మన చుట్టూ రకరకాల మనస్తత్వాలున్న వ్యక్తులు ఉంటారు. వాళ్లంతా ఎప్పుడెలా స్పందిస్తుంటారు? అనే కథాంశంతో తెరకెక్కింది. ఈ సినిమా కోసం సొంతంగా డబ్బింగ్ చెప్పానని తెలిపింది. ప్రస్తుతం ‘వి’, ‘శ్వాస’ సినిమాల్లో నటిస్తున్నానంది. సూపర్ స్టార్ రజనీకాంత్‌ సినిమా ‘దర్బార్‌’లో సినిమాలో నటిస్తున్నారా ? అని అడిగితే.. ఆ సినిమా గురించి నేనుగా ఏదీ చెప్పలేను. ఆ సంస్థే ప్రకటించాలని సస్పెన్స్ లో పెట్టేసింది.