భాజాపాలో చేరిన మరో తెదేపా నేత

తెదేపా నుంచి భాజాపాలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు భాజపాలో చేరగా.. తాజాగా ఆ పార్టీ అధికార ప్రతినిధి లంకా దినకర్‌ కమలం గూటికి చేరారు. ఢిల్లీలో భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన కమల దళంలో చేరారు.

ఏపీలో మరింత బలపడేందుకు భాజాపా యత్నిస్తోంది. ఇందులో భాగంగా తాజా రాజకీయ పరిణామాలని వాడుకొంటోంది. ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజాయాన్ని చవిచూసిన తెదేపా నేతలని నేతలని పార్టీలో చేర్చుకొంటోంది. తద్వారా ఏపీలో బలపడాలని, వైకాపాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని భాజాపా భావిస్తోంది.