బస్సు లోయలోపడి 24 మంది మృతి

జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కేశ్వాన్‌ నుంచి కిష్త్వార్‌ వెళ్తున్న ఓ ప్రయాణికుల బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 24 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.