భార్యాబిడ్డలను అతి కిరాతకంగా హతమార్చిన కసాయి తండ్రి


గురుగ్రామ్‌లోని ఉప్పల్‌ సౌత్‌ఎండ్‌హోంలో దారుణం చోటు చేసుకొంది. ఓ ఫార్మా సంస్థ సీనియర్‌ ఉద్యోగి.. భార్యను, కన్నబిడ్డలను అత్యంత దారుణంగా హత్య చేసి… ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు.

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. ప్రకాశ్‌సింగ్‌ ముందుగా ఇంటిలోపలి గడియలన్నిటినీ తాళం పెట్టేశాడు. తన భార్య సోనూసింగ్‌(50), కుమార్తె అదితి(22), కుమారుడు ఆదిత్య(13)లపై సుత్తితో దాడికి దిగాడు. భార్య, కుమార్తె, కుమారుడిని పట్టుకుని కత్తులతో విచక్షణారహితంగా పొడిచి, గొంతులు కోశాడు. హత్యల అనంతరం ప్రకాశ్‌సింగ్‌ తన పెంపుడు కుక్కలతో గంటసేపు ఆడుకున్నాడు. తర్వాత ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖరాశాడు. కుటుంబసభ్యుల హత్యలకు తానే కారణమని అందులో పేర్కొన్నాడు. ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయాయి.