శ్రీహరి పేరు నిలబెడతాడు


శ్రీహరి తనయుడు మేఘాంశ్‌ హీరోగా దూసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘రాజ్ దూత్’. నక్షత్ర, ప్రియాంక వర్మ కథానాయికలు. అర్జున్‌ – కార్తీక్‌ దర్శకత్వం వహించారు. ఎమ్‌.ఎల్‌.వి.సత్య నారాయణ నిర్మాత.
ఈ వారం (జూన్5)న రాజ్ దూత్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకని నిర్వహించారు

ఈ సందర్భంగా శాంతి శ్రీహరి మాట్లాడుతూ.. ‘‘మా అబ్బాయి మేఘాంశ్‌ చిన్నప్పుడే ‘భైరవ’ చిత్రంలో నటించాడు. పాఠాలు సరిగా చదివేవాడు కాదు. సినిమా డైలాగులు మాత్రం బాగా గుర్తు పెట్టుకునేవాడు. నటన తన రక్తంలోనే ఉందని అప్పుడే అర్థమైంది. ప్రచార చిత్రం చూశాక శ్రీహరిగారి పేరు నిలబెడతాడన్న నమ్మకం కలిగింద’’న్నారు.