జియో కొత్త ప్లాన్.. వారికి మాత్రమే !

టెలికాం సంచలనం జియో కొత్త ప్రిపెయిడ్ రీచార్జ్ ప్లాన్‌ను ఆవిష్కరించింది. కేవలం అమర్ నాథ్ యాత్రికులని దృష్టిలో పెట్టుకొని
ఈ ప్లాన్ ని తీసుకొచ్చింది. రూ.102 లతో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ని తీసుకొచ్చింది. ఈ ప్లాన్ లో అపరిమిత కాలింగ్ సదుపాయంతో పాటు.. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. రోజుకు 500 ఎంబీ హైస్పీడ్ డేటా లభించనుంది. ఈ ప్లాన్ వాటిడిటీ మాత్రం 7రోజులు మాత్రమే. ఇది కేవలం జమ్మూ అండ్ కశ్మీర్ సర్కిల్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

రూ. 98 ప్రిపెయిడ్ ప్లాన్‌ను కూడా తీసుకొచ్చింది. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. ఈ ప్లాన్ లో2 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, 300 ఎస్ఎంఎస్‌లు పొందవచ్చు. ఇక, రూ. 142 రీచార్జ్ ప్లాన్‌లో రోజులకు 1.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్, 300 ఎస్ఎంఎస్‌లు వంటి ప్రయోజనాలున్నాయి.