నాగచైతన్యకు సమంత ఎంత కట్నం ఇచ్చిందో తెలుసా ?


నాగచైతన్య-సమంత జంట ప్రేక్షకులని మాయ చేసేంది. వాళ్లిద్దరూ కూడా మాయలో పడిపోయారు. ‘ఏం మాయ చేసావె’ సినిమా సమయంలోనే మనసులు కలిశాయ్. అది కాస్త ప్రేమగా మారింది. పెళ్లివరకు వచ్చింది. పెళ్లి తర్వాత కూడా ఈ జంట ప్రేక్షకులని మాయ చేస్తోంది. పెళ్లి తర్వాత చైతూ-సామ్ తొలిసారి కలిసి నటించిన మజిలీ సూపర్ హిట్ అయింది. ఈ విషయం పక్కన పెడితే.. చైతూ సామ్ ఎంత కట్నం ఇచ్చింది ? ఇదే డౌటు గంగమ్మకు వచ్చింది. వెంటనే సామ్ ని అడిగేసింది.

సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఓ బేబీ’. నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్ ని కాస్త విభిన్నంగా చేశారు. సోషల్‌మీడియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న గంగవ్వతో కలిసి నందినీరెడ్డి, సమంత ఓ ప్రముఖ యూట్యూబ్‌ ఛానెల్‌ నిర్వహించిన ఫన్నీ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలో గంగవ్వ.. సమంతను, నందినీ రెడ్డిని తన ఫన్నీ ప్రశ్నలతో ముప్పతిప్పలు పెట్టింది. నాగచైతన్యను ఎంత కట్నం ఇచ్చి పెళ్లి చేకున్నావ్ ? అని సామ్ ని అడిగేసింది. దానికి చాలా ఇచ్చాను. ఎంత ఇచ్చానో నేను మీ చెవులో చెప్తానని సామ్ సమాధానం ఇచ్చింది. ఇలా ప్యాంట్‌, షర్ట్‌ వేసుకుంటారు. మీ భర్త ఏమీ అనరా? అని నందిని రెడ్డిని అడిగింది. నాకు తెలివి ఎక్కువ. ఇలా ఉన్నానని నా భర్త ఏమైనా అంటాడేమోనని నేను పెళ్లి చేసుకోలేదని నందినిరెడ్డి సమాధానిమిచ్చారు.