లోకేష్’ని జాకీలు పెట్టి మరీ.. లేపుతున్నారట !

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ పై ‘పప్పు’ అనే ముద్రపడిపోయింది. ఆ ట్యాగ్ కు తగ్గట్టుగానే లోకేష్ పలుమార్లు దొరిక్కిపోయాడు. అవి ప్రత్యర్థులకి అస్త్రాలుగా మారాయి కూడా. ఇప్పుడు తెదేపా ప్రతిపక్షంలో ఉన్న.. ప్రజా సమస్యల కంటే లోకేష్ ని ఎలా ఫోకస్ చేయాలన్న దానిపైనే ప్రయత్నాలు జరుగుతున్నట్టు కనిపిస్తోంది. రోజువారిగా లోకేష్ చేసే ట్విట్స్, కామెంట్స్ ని హైలైట్ చేసే ప్రయత్నంలో ఎల్లో మీడియా ఉంది. ఈ నేపథ్యంలోనే లోకేష్ ని జాకీలు పెట్టి మరీ.. లేపుతున్నారని వైకాపా నేతలు విమర్శిస్తున్నారు.

తాజాగా వైసీపీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. వరుస ట్విట్స్ తో విరుచుకుపడ్డారు.

“ప్రపంచవ్యాప్తంగా మనుషుల్లో గుర్తించిన ఫోభియాలను సైకాలజీ 5 కేటగిరీలుగా విభజించింది.చంద్రబాబు గారికి సైకియాట్రిక్ పరీక్షలు చేస్తే ఆరో కేటగిరి కూడా ఉందని తేలుతుంది.ఎక్కడేం జరిగినా రాష్ట్రాన్ని కడప,పులివెందులలాగా మారుస్తున్నారని పదేపదే తన అకారణ భీతిని(ఫోభియా) వ్యక్తం చేస్తుంటారాయన”

“లోకేశ్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలనేమో జాకీలు పెట్టి లేపుతున్నారు. తండ్రి సైగ చేసి ఉంటారు. కొత్త ప్రభుత్వం వచ్చి 5 వారాలే అయిందన్న సృహ కూడా లేకుండా ట్వీట్లతో నవ్వులు పూయిస్తున్నాడు. సీఎం కొడుకు, మంత్రి అయిఉండి మంగళగిరిలో ఓడినప్పుడే లోకేశ్‌ చెల్లని కాసు అయిపోయాడు”

“అవినీతి కేసుల్లో లోపల వేస్తరేమోనని అనుమానం వచ్చినప్పుడల్లా చంద్రబాబుకు తన భద్రత గుర్తొస్తుంది. తనను అరెస్ట్ చేస్తే చుట్టూ నిలబడి రక్షణ కల్పించాలని గతంలో ప్రజలను వేడుకున్నారు.తనకేదైనా అయితే రాష్ట్రాన్ని కంట్రోల్ చేయలేరని ఇప్పుడు బెదిరిస్తున్నారు.దాడి నాటకానికి ప్లాన్ చేశారా ఏంటి?” అంటూ వరుస ట్విట్ చేశారు విజయసాయి. విజయసాయి ట్విట్లపై ట్విట్టర్ బాబు లోకేష్ బాబు ఎలా స్పందిస్తారన్నది చూడాలి.