దీనమ్మా పూరితో పనిచేస్తే.. ఆ కిక్కే వేరు !


పూరి దర్శకత్వంలో ఎనర్జిట్ హీరో రామ్ నటిస్తున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. నిధి ఆగర్వాల్, నభా నటాషా హీరోయిన్లు. ఛార్మితో కలిసి పూరి నిర్మిస్తున్నారు. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం వరంగల్ లో ఇస్మార్ట్ శంకర్ ప్రీ రిలీజ్ వేడుకని ‘ఇస్మార్ట్ శంకర్ బోనాలు ఈవెంట్’ పేరిట ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్ కిక్కునిచ్చే మాటలు మాట్లాడారు.

ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ స్టైల్లో ‘దీనమ్మా పూరితో పనిచేస్తే.. ఆ కిక్కే వేరు’ అన్నారు. ఈ సమయంలో ‘పిల్లలు చెవులు మూసుకోండి’ అని సలహా కూడా ఇచ్చారు. ‘బోనాలు పండుగకు వరంగల్ రావడం, ఇక్కడ బోనాలు సాంగ్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు రామ్. ఇక, వరుస ప్లాపుల్లో ఉన్న రామ్, పూరిలకి ఇస్మార్ట్ శంకర్ చాలా కీలకం. ఈ సినిమా హిట్ కొట్టి మళ్లీ హిట్ ట్రాక్ లోకి రావాలని ఆశపడుతున్నారు.