రూ. 1500కోట్లతో అల్లు అరవింద్ ‘రామాయణం’ !

టాలీవుడ్ నుంచి మరో భారీ బడ్జెట్ సినిమాకు రంగం సిద్ధమవుతోంది. మెగా నిర్మాత అల్లు అరవింద్ రామాయణాన్ని తెరపైకి తీసుకురాబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా రూ. 1500కోట్లు ఖర్చు చేయనున్నట్టు సమాచారమ్. ఈ చిత్రానికి ‘దంగల్‌’ దర్శకుడు నితీష్‌ తివారీ దర్శకత్వం వహించనున్నారు. ఆయనతో పాటు రవి ఉడ్యాయార్‌ కూడా దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తారని తెలిసింది.

బాలీవుడ్ తో పాటు దేశంలోని అన్నీ ప్రాంతీయ బాషలకి సంబంధించిన అగ్ర నటీనటులు రామాయణంలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్, బిగ్ బీ అమితాబ్ కీలక పాత్రల్లో నటించనున్నారు. టాలీవుడ్ నుంచి స్టార్ హీరోలు ప్రభాస్, మహేష్, ఎన్ టీఆర్, బన్నీ, రానా లలో ఒకరిద్దరు రామాయణంలో మెరసే చాన్స్ ఉందని సమాచారమ్.