ప్రేమకు నో చెప్పి… లాడ్జికి ఎందుకు వెళ్లినట్టు ?


హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లో దారుణం చోటు చేసుకొంది. ఓ ప్రేమోన్మాది ప్రియురాలిని గొంతుకోశాడు. వివరాల్లోకి వెఌతే.. నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటేశ్‌ (22), బడంగ్‌పేటకు చెందిన మనస్విని ఇద్దరికీ ఓ బ్యాంక్‌ కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పరిచయం ఏర్పడింది. దీంతో వారిద్దరి మధ్యా స్నేహం కొనసాగింది. వెంకటేశ్‌ ప్రవర్తన నచ్చని యువతి గత కొంతకాలంగా అతడిని దూరంగా ఉంచింది. దీంతో మనస్వినిపై కక్ష పెంచుకున్నాడు.

ఈ క్రమంలో దిల్‌సుఖ్‌నగర్‌లోని బృందావన్‌ లాడ్జిలో 501 నంబర్‌ గదిని ఆన్‌లైన్‌లో అద్దెకు తీసుకున్నాడు. మంగళవారం మనస్విని (22)కి ఫోన్‌ చేసి రావాలని కోరగా.. వారిద్దరూ కలిసి ఉదయం 10గంటల సమయంలో లాడ్జి వద్దకు చేరుకున్నారు. ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారంలో మాటా మాటా పెరిగి ఈ దారుణానికి దారి తీసినట్టు తెలుస్తోంది. ఐతే, ప్రేమకు నో చెప్పిన మనస్విని పిలవగానే లాడ్జికి ఎందుకు వెళ్లినట్టు ? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. పోలీసులు కూడా తమ దర్యాప్తులో ఈ విషయంపై ఫోకస్ చేస్తున్నారు. ఏమైనా బ్లాక్ మెయిల్ చేసి ఉంటాడనే అనుమానులు కూడా కలుగుతున్నాయి.