కోహ్లీ టార్గెట్ ఇద్దరు, విలియమ్సన్ టార్గెట్ ఒక్కరే !


ప్రపంచకప్ సెమీస్ లో భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. మరికొద్దిసేపట్లో మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో ఎవరు ఎవరిని టార్గెట్ చేయబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. ముందు మీడియాతో మాట్లాడిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తమ టార్గెట్ విలియమ్సన్, రాస్ టైలర్ అన్నారు. వీరిద్దరిని అవుట్ చేయడం ద్వారా కివీస్ ని ఒత్తిడిలోకి నెట్టొచ్చు అన్నది కోహ్లీ ప్లాన్.

ఇక, కివీస్ కెప్టెన్ విలియమ్ సన్ మాత్రం సింగిల్ టార్గెట్ పెట్టుకొన్నాడు. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ నే తమ టార్గెట్. రోహిత్ ని త్వరగా అవుట్ చేస్తే.. పెద్దగా ఫామ్ లేని మిడిల్ ఆర్డర్ ని ఈజీగా ఇబ్బంది పెట్టొచ్చు అన్నది కెన్ ప్లాన్ లా కనిపిస్తోంది. అంతేకాదు.. తాము అండర్ డాగ్స్ గా అడుగుపెడుతున్నాం. తాము మ్యాచులో ఏ విధంగా అడుతాం, తమ ప్లాన్స్ ఏ విధంగా అమలు చేస్తాం అనేవే ఇక్కడ ముఖ్యమవుతాయని అన్నాడు కెన్.

మరీ.. ఎత్తులు, పైఎత్తుల్లో ఎవరు గెలుస్తారు. మెగా టోర్ని గెలవడానికి మరో అడుగుముందుకు ఎవరు వేస్తారు అన్నది చూడాలి.