ఆ బిజినెస్’లోకి దిగిన కాజల్.. !


చందమామ కాజల్ కెరీర్ ముగింపు దశకు చేరుకొంది. వయసు, అనారోగ్య సమస్యలతో ఆమె ఎక్కువరోజులు హీరోయిన్ గా కొనసాగే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో ఆమె బిజినెస్ పై ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. చెల్లెలు నిషా అగర్వాల్ తో కలిసి పలు వ్యాపారాలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటోంది. ఇప్పటికే ‘KA వెంచర్’ పేరుతో సొంత బ్యానర్ ని ఏర్పాటు చేసుకొంది. ఈ బ్యానర్ లో రాబోతున్న తొలి చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించనున్నారు.

మరోవైపు, ఓ షూ కంపెనీ, హోటల్ బిజినెస్ చేస్తోంది. తాజాగా కొత్త బిజినెస్ లోకి అడుగుపెట్టబోతున్నట్టు సమాచారమ్. ముంబైలో నగల దుకాణం ప్రారంభించబోతుంది. చెల్లెతో కలిసి బంగారం బిజినెస్ చేయనుందట. త్వరలోనే కాజల్ పెళ్లి చేసుకోబోతుంది. పెళ్లి తర్వాత భర్తని, వ్యాపారాలు చూసుకొంటుందట. ఇక, సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం కాజల్ శర్వానంద్ రణరంగంలో నటిస్తున్నారు. ఆమె చేతిలో ఉన్న భారీ ప్రాజెక్ట్ భారతీయుడు2. షూటింగ్ ప్రారంభం అయ్యాక.. ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది.