టీమిండియా టార్గెట్ 240 పరుగులు


న్యూజిలాండ్ ని 239 పరుగులకే కట్టడి చేశారు టీమిండియా బౌలర్లు. కివీస్ 46.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసిన దశలో మంగళవారం వర్షం కురవడంతో ఆగిపోయిన మ్యాచ్ బుధవారం తిరిగి ప్రారంభం అయింది. కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది.

90 బంతుల్లో 74 పరుగులు చేసిన టేలర్ జడేజా అద్భుతంగా రనౌట్ చేశాడు. ఆ తర్వాత భువి బౌలింగ్‌లో టామ్ లాథమ్ జడ్డూకే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత భువి విసిరిన 49 ఓవర్లో హెన్రీ (1) కోహ్లికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో కివీస్ టీమిండియా ముందు 240 పరుగుల టార్గెట్ ని ఉంచినట్టుంది. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమిండియాకు ఈ లక్ష్యం పెద్దదేం కాదు. కాకపోతే.. ఆరంభంలో వికెట్లు కోల్పోకుండా జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది.