అల్లు అర్జున్ సంక్రాంతి బుల్లోడు


అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. పూజా హెగ్డే కథానాయిక. గీతా ఆర్ట్స్‌, హారిక హాసిని క్రియేషన్స్‌ సంస్థలు తెరకెక్కిస్తున్నాయి. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం బుధవారం ప్రకటించింది. ఈ సినిమా కోసం ‘అలకనంద’, ‘నాన్న..నేను’ అనే పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

అల్లు అర్జున్ నటిస్తున్న 19వ చిత్రమిది. ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి సీజన్‌ లో ఎన్ని చిత్రాలొచ్చినా వసూళ్ల వర్షం కురిస్తుంటాయి. ఇప్పటికే మహేష్, బాలయ్య, శర్వానంద్, సాయిధరమ్ తేజ్ తదిరలు సంక్రాంతి కి ఫిక్సయ్యారు. ఇప్పుడు బన్నీ కూడా పండగ రావడం పక్కా అని తెలిపారు. దీంతో 2020సంక్రాంతి పోరు రసవత్తరంగా మారనుంది.