రామ్ చరణ్ ఫస్ట్ పోస్ట్ చూశారా.. ?


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే ఇన్ స్ట్రోగ్రామ్ ఖాతా ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఫస్ట్ ఫోస్ట్ ఏం పెడతారని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తొలి ఏకాదశి సందర్భంగా చరణ్ తన ఇన్ స్ట్రోగ్రామ్ లో ఫస్ట్ పోస్ట్ పెట్టేశారు. అమ్మ ఓడిలో చిన్నప్పుడు, ఇటీవల దిగిన ఫోటోలని జతచేసిన పిక్ ని పోస్ట్ చేశాడు. ఇప్పుడీ పోస్ట్ వైరల్ అవుతోంది. చరణ్ గుండెల్ని పిండేశాని కామెంట్స్ పెడుతున్నారు.

ప్రస్తుతం రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’తో బిజీగా ఉన్నారు. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న చిత్రమిది. కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు ల కథతో తెరకెక్కుతోంది. వీరిద్దరి మధ్య గల కామన్ పాయింట్ ఆధారంగా జక్కన్న కథని రాసుకొన్నారు. కొమరం భీమ్ గా తారక్, అల్లూరిగా రామ్ చరణ్ నటిస్తున్నారు. చరణ్ కి జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్నారు. తారక్ జంటగా ఇంకా హీరోయిన్ ఫిక్స్ కాలేదు. దాదాపు రూ. 400కోట్ల బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. వచ్చే యేడాది జులై30న ఆర్ ఆర్ ఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.